నా దారికి వచ్చావు
నా మనసున స్నేహం నింపి
కనులకు చినుకులు చేర్చావు
చేతలకు అందలేదు
మాటలకూ అందలేదు
చూపులకు తోస్తున్నావు
చేరాలని రెక్కలు నే కట్టినా
అంత దూరం రాలేకున్నా
నే తప్పులు చేస్తే
మెరుపులతో బెదిరించు
ఉరుములతో దాడిచేయించు
నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు
చినుకులైనా కురిపించు
మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!
ఈ కవితను నా నేస్తం వ్రాసాడు ఇంకో నేస్తం కోసం..నాకు చాలా నచ్చి ఇక్కడ ప్రచురించుకుంటున్నాను.
మౌనం ఒక్కోసారి ఎంత నరకమో కదా..అదీ ఆత్మీయులనుకున్నవారు పలకరించకపోతే ఇంక ఆ బాధ కన్నా విపరీతమైనది సృష్టిలో లేనే లేదు.నా వరకు నాకు ఇలానే అనిపిస్తూ ఉంటుంది.
నిశ్శబ్ధం ఆవరించిన నల్లని మేఘం.. నిజమే అది కురవాలి..కురవాలంటే చల్ల గాలి తోడవ్వాలి..ఆ గాలి తోడు లేకుంటే ఆ మేఘం ఎందుకు?
స్నేహమూ అంతే.. మనసుకు వేరొక మనసే సాంత్వన అందించాలి.లేకుంటే మనసు మనుగడేది? ఒంటరిగా కుమిలిపోవడం తప్ప.అప్పటివరకు కురవని మేఘంలా స్తబ్ధుగా ఉన్న మనసు ఒక చిన్న ఆత్మీయ స్పర్శతో పులకించి కురిసిపోతుంది. సంతోషంలోనే కాదు కష్టంలో కూడా మనసుకు మనసు చేదోడుగా ఉంటే ఆ స్నేహంలో తీయదనం చెప్పేదేముంది! ఇలాంటి ఒక స్నేహం ఉంటే జీవితమే మధురం కదూ..మనుషులు దూరంగా ఉన్నా మనసుల్లో ఎప్పటికీ పదిలమీ స్నేహం.అందుకే కొన్ని సార్లు రక్తబంధం కన్నా స్నేహబంధం గొప్పది అంటారు పెద్దలు.ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే కదండీ.ఐనా నేను చెప్పేదేముందీ ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలిసినదే ఈ స్నేహమాధుర్యం..